విశాఖపట్టణంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ సత్తా చాటాడు. సెంచరీని సాధించాడు. 154 బంతుల్లో రోహిత్ 10 ఫోర్లు , 4 సిక్సర్ల సాయంతో శతకొట్టాడు. రోహిత్ సెంచరీ కొట్టడంతో స్టేడియంలోని ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఈ క్రమంలో రోహిత్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓపెనర్ గా దిగిన తొలి టెస్టు, తొలి ఇన్నింగ్స్ లోనే సెంచరీ సాధించాడు.
ప్రస్తుతం రోహిత్ శర్మ 174 బంతుల్లో 115 పరుగులతో(12 ఫోర్లు, 5 సిక్సర్లు), మయాంక్ అగర్వాల్ 183 బంతుల్లో 84 పరుగులతో (11 ఫోర్లు, 2 సిక్సర్లు) రోహిత్ కు అండగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 202 పరుగులు (59 ఓవర్లు) చేసింది. భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది.