ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోహిత్ శర్మ సెంచరీ..భారీ స్కోరు దిశగా టీమిండియా

national |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2019, 02:35 PM

విశాఖపట్టణంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ సత్తా చాటాడు. సెంచరీని సాధించాడు. 154 బంతుల్లో రోహిత్ 10 ఫోర్లు , 4 సిక్సర్ల సాయంతో శతకొట్టాడు. రోహిత్ సెంచరీ కొట్టడంతో స్టేడియంలోని ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఈ క్రమంలో రోహిత్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓపెనర్ గా దిగిన తొలి టెస్టు, తొలి ఇన్నింగ్స్ లోనే సెంచరీ సాధించాడు. 


ప్రస్తుతం రోహిత్ శర్మ 174 బంతుల్లో 115 పరుగులతో(12 ఫోర్లు, 5 సిక్సర్లు), మయాంక్ అగర్వాల్  183 బంతుల్లో 84 పరుగులతో (11 ఫోర్లు, 2 సిక్సర్లు) రోహిత్ కు అండగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 202 పరుగులు (59 ఓవర్లు) చేసింది. భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com