కృష్ణానదికి వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. పది గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్ ఫ్లో 2 లక్షల 12వేల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. జలాశయం నిండుకుండలా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884 వరకు నీరు ఉంది. జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి 1.52 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 12 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం 10 గేట్లు ఎత్తి 3.48 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు. నాగార్జునసాగర్ 14 గేట్లు ఎత్తి 2.06 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల 8 గేట్లు ఎత్తి 2.53 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.