ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1న జరపాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2019, 09:29 AM

 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1 న జరపాలంటూ ‘ఆంధ్ర మేథావుల ఫోరం’ ముఖ్యమంత్రి జగన్మోహన్ కి వినతిని సమర్పించింది. ఈ సందర్భంగా పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ వినతిలో క్రింది అంశాలను ప్రస్తావించారు... అవి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నేటి వరకూ విభజన తరువాత అవతరణ దినోత్సవం జరపటం ఆపివేసినదని.. మొదటగా జూన్ 2న ఆ దినోత్సవం జరపాలని నిర్ణయించగా తమ వేదిక నాడే తీవ్రంగా వ్యతిరేకించినదని తెలిపారు. వ్యవహారికంగా చూస్తే అక్టోబర్ 1 , 1953 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగా ఆరోజు పుట్టినరోజుగా, నవంబర్ 1, 1956లో తెలంగాణతో వివాహదినం, అదే జూన్ 2 విడాకుల దినంగా మాత్రమే అవుతుందని తెలిపారు. అక్టోబర్ 1న ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాల్సిందిగా మేము గత ప్రభుత్వాన్ని అనేకసార్లు అడిగాము. స్పందన లేదని,  ఈ విషయమై తక్షణ చర్య తీసుకుని అవతరణ దినోత్సవం జరపవలసిందిగా జ‌గ‌న్‌ని కోరుతున్న‌ట్టు  ఫోరం ప్ర‌తినిధులు చెప్పారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com