ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధానికి జగన్ రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే : చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2019, 06:07 PM

విద్యుత్ కొనుగోళ్లలో తెలుగుదేశం పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించి అభాసుపాలయ్యారు.గుంటూరు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ సీఎం మాట్లాడుతూ ..భవిష్యత్తు లో విద్యుత్ చార్జీలు పెంచమనే రీతిలో సంస్కరణలు తెస్తే..., నేడు వేలాది కోట్ల నష్టం అంటున్నారు.ప్రధానికి జగన్ రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే ఉన్నాయి.. ఆనాడు రాష్టం లోటు బడ్జెట్ లో ఉన్న విద్యుత్ సరఫరా విషయంలో రాజీ పడలేదు.. ఎప్పుడూ కూడా కరెంట్ చార్జీలు పెంచిన దాఖలాలు లేవు.. టెక్నాలజీ తో సోలార్ విధానాన్ని తీసుకు వచ్చాం.దీర్ఘకాలంలో పునరుత్పాదక విద్యుతే చవక అని కేంద్రమంత్రి కూడా లేఖలో చెప్పారు..కోర్టు చెప్పినా, కేంద్రం చెప్పినా ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించారు..ప్రధాని కార్యాలయానికి తప్పుడు సమాచారం ఇచ్చే అధికారం అధికారులకు ఎవరిచ్చారు..


 


43వేల కోట్ల కుంభకోణం చేసిన వ్యక్తికి ఉత్తముడని దృవీకరించి...., మాపై బురద చల్లేట్లు సమాచారం ఇచ్చే అధికారం ఎవరిచ్చారు.ప్రభుత్వం చేసే తప్పులకు అధికారులు బలిపశువులు కావొద్దు.ఎవరెన్ని చెప్పినా మారే జ్ఞానం సీఎం కు రావట్లేదు.మీరు అవినీతి పరులు కాబట్టి అందరినీ అలానే చిత్రీకరించాలనుకోవటం తగదు.పోలవరం కి ఆరోజు ఎక్కువ కోట్ చేసిన వ్యక్తికి ఈరోజు టెండర్ ఇస్తారు.ఏ టర్బైన్ లు అమర్చుతారో కూడా చెప్పని సంస్థకు ప్రాజెక్టును అప్పగిస్తారా.750కోట్లు లాభo అని రు.7500కోట్లు నష్టం చేకూరుస్తున్నారు.ఇసుకను దోచేసామని అబాండాలు వేశారు.టీడీపీ హయాంలో ఇసుక ధర ఎంత ఇప్పుడెంతో సమాధానం చెప్పాలి. వాలంటీర్ల పేరుతో  భర్తలు ఇంట్లో లేనప్పుడు ఇంటికి వెళ్లి తలుపులు కొడతారా?.


 


 5000 జీతం ఇచ్చి వాలంటీర్లుగా పేరు పెడతారా.పేద ప్రజలను భయపెట్టి పక్క రాష్టలకు పంపాలని చూస్తున్నారా?.ప్రజాసామ్యంన్నీ కూని చేస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా?తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.ప్రభుత్వం బెదిరింపులు మానుకోవాలి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com