విశాఖపట్నం: ఏపీలో మరో రెండు, మూడ్రోజులు పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల ప్రభావం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా ఉండొచ్చని పేర్కొంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ ఆమడగూరులో 3 సెం.మీ, కంబదూరులో 3 సెం.మీ, ఎమ్మిగనూరులో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది. శనివారం విజయవాడలో 42.7, తిరుపతిలో 42.4, కడపలో 42.5, అనంతపురంలో 41.6, కర్నూలులో 41.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.