మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. చంద్రాపూర్ – నాగపూర్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. కేంద్ర మాజీ మంత్రి హన్స్రాజ్ ఆహిర్ కాన్వాయ్లోని కారును వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఒక సిఆర్పిఎఫ్ జవాను, మహారాష్ట్ర పోలీసు డ్రైవర్ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.