హైదరాబాద్: ‘బాహుబలి 2’ విడుదలైనప్పటి నుంచి చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రముఖులు, అభిమానులు చిత్రం అద్భుతంగా ఉందంటూ సోషల్మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో కథానాయకుడు మహేష్బాబు కూడా చేరారు. ‘బాహుబలి 2’ను చూసిన మహేష్.. సినిమా అంచనాలకు మించి ఉందని ట్వీట్ చేశారు. అద్భుతమైన పనితీరుని కనబరిచిన దర్శకుడు రాజమౌళి, చిత్ర బృందానికి హాట్సాఫ్ చెప్పారు.
మహేష్ ప్రస్తుతం ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో ‘స్పైడర్’ చిత్రంలో నటిస్తున్నారు. రకుల్ప్రీత్ సింగ్ కథానాయిక. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్లుక్కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.