ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబరు 29 నుంచి దేవుని కడప వెంక‌న్న‌ నవరాత్రి ఉత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2019, 10:40 PM

 టిటిడికి అనుబంధంగా ఉన్న దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 29 నుంచి అక్టోబ‌రు 8వ తేదీ వరకు ద‌స‌రా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 29న తిరుచ్చి, సెప్టెంబరు 30న శేష వాహనం, అక్టోబ‌రు 1న చంద్రప్రభ వాహనం, అక్టోబ‌రు 2న హనుమంత వాహనం, అక్టోబ‌రు 3న కడప పట్టణంలో, 5న పాత కడపలో గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. అదేవిధంగా అక్టోబ‌రు 4న క‌ల్ప‌వృక్ష వాహ‌నం, అక్టోబ‌రు 6, 7వ తేదీల్లో తిరుచ్చి ఉత్స‌వం, అక్టోబ‌రు 8న అశ్వవాహనసేవ చేప‌డ‌తారు. భ‌క్తులంద‌రూ ఈ ఉత్స‌వంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది. టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్ ఈ ఉత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com