ఉత్తర భారతదేశంలో పలు చోట్ల భూమి కంపించింది. ఢిల్లీ శివారులోని ఎన్సీఆర్ ప్రాంతంలో భూమి కదిలింది. దీంతో ప్రజలు ఇండ్ల నుండి బయటకు పరుగులు తీశారు. జమ్మూ,పంజాబ్,హర్యానా లోనూ పలు చోట్ల భూమి కంపించింది. ఢిల్లీలో భూకంప తీవ్రత రెక్టార్ స్కెల్ పై 6.3 గా నమోదైంది. పాకిస్తాన్ కేంద్రంగా భూకంపం ఏర్పడినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ లోని రావల్పిండి, ఇస్లామాబాద్ లోని భూమి కంపించింది. లాహోర్ కు 190 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడినట్లు శాత్రవేత్తలు తెలిపారు.