ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా భార్య నోవెల్ సింఘాల్కు ఆదాయం పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐటీ రిటర్న్స్ కోసం నోవెల్ సింఘాల్ చేసుకున్న దరఖాస్తులో అనుమానాలు ఉన్నాయని, వాటిపై వివరణ కావాలని ఐటీశాఖ తన నోటీసులో స్పష్టం చేసింది. పలు కంపెనీల్లో ఇండిపెండెంట్ డైరక్టర్గా ఉన్న సింఘాల్.. ఐటీ రిటర్న్స్ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఐటీశాఖ వివరణ కోరింది. పలు కంపెనీల నుంచి సింఘల్కు ఆదాయం వస్తున్నదని, కానీ రిటర్న్స్ కోసం దాఖలు చేసిన పత్రంలో లోపాలు ఉన్న కారణంగా ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు ఐటీశాఖ చెప్పింది. బ్యాంక్ ఉద్యోగి అయిన సింఘాల్.. 2005లోనే ఎస్బీఐ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.