పోలవరం ఘటనలో బోల్తా పడ్డ బోటును వెలికితీస్తే వాస్తవాలు బయటకొస్తాయని, ఈ ఘటనను హైకోర్టు సుమో టోగా తీసుకుని విచారణ చేపట్టాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కోరారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో బాధితులని పరామర్శించేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ లకు కూడా ఖాళీలేకపోవటం విచిత్రమన్నారు. సీఎం జగన్ ఏదో విహార యాత్రగా వచ్చి సమీక్ష చేసి వెళ్లిపోవడం మినహా బాధితులకు న్యాయం చేసిందేమీ లేదన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి వద్ద బోల్తా ఘటనలో బాధితులతో కలిసి ఆయన నిరసన తెలియచేసి మాల్లాడుతూ గోదావరిలో మృతదేహాలను వెలికితీసి అప్పగించకుండానే డెత్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తుండటం చూస్తుంటే కాకినాడ పోర్టు అధికారి ధర్మశాస్తను కాపాడడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని హర్షకుమార్ ఆరోపించారు. దీనికి తోడు కేంద్రమంత్రి కిషన్రెడ్డి కూడా ఈ విషయమై హడావిడిగా అతిథిగృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, మునిగిన బోటును తీయలేమని ప్రకటించి వెళ్లిపోయారు మినహా కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించ పోవటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మునిగిపోయిన బోటును బైటకు రప్పించడం ద్వారాలనే అనేక అనుమానాలు నివృత్తి అవుతాయని, ఇప్పటికే అదే రోజు ప్రయాణంకు ఏర్పాట్లు చేసుకున్నవారి బంధువులు తమ వారు కనిపించడంలేదన్న ఆందోళనలో ఉన్నట్లు హర్షకుమార్ చెప్పారు. ఈ కేసు సుమోటాగా తీసుకుని బోటు వెలికితీయాలని ప్రభుత్వానికి కోర్టు త క్షణం ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసారు.