అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ వ్యయాన్ని రూ.36 కోట్లకు తగ్గించి ఒక ప్రాకారంతో ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం కొత్త టిటిడి ధర్మకర్తల మండలి తొలి సమావేశం నిర్ణయం తీసుకోవటం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దైవ ప్రతిష్టకు ప్రభుత్వం కనుసన్నలలోనే ఈ తరహా నిర్నయం జరిగిందన్న వాదనలు తలెత్తుతున్నాయి. ప్రతిష్టాకరం దేశ రాజధానిలో ఆరంభమైన వెంకటేశ్వరుని ఆలయ నిర్మాణం గత కొన్నిరోజులుగా నిలపి వేసిన సంగతి విదితమే. తాజా రాజకీయ పరిణమాల క్రమంలో అమరావతి నుంచి రాజధాని మార్చే ఆస్కారం ఉందని, ఇది పూర్తి ముంపు ప్రాంతమని మంత్రులే సన్నాయి నొక్కులు నొక్కుతున్న నేపథ్యంలో ఆలయ నిర్మాణం ప్రశ్నార్ధంగా మారింది. అయితే ప్రభుత్వం చర్చి, మసీదులపై సానుకూల ధోరణి చూపుతోందని, భక్తుల డబ్బులే వెచ్చించి ఆలయ నిర్మాణం జరిపేందుకు తితిదే ముందుకు వచ్చినా ప్రభుత్వంలోని కొందరు పెద్దలే మోకాలడ్డుతున్నారన్న వాదనలూ పెరుగుతున్నాయి.