ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉల్లి ధరల పై అధికారులతో సమీక్షించిన మంత్రి మోపిదేవి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2019, 03:42 PM

ఉల్లి ధరల పై అధికారులతో సమీక్షించిన మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణ.ఉల్లి ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావటానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం.బుధ/గురు వారం నుండి  మహారాష్ట్ర నుండి ఉల్లిని తెప్పించి రైతు బజార్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈమధ్య కాలంలో సంభవించిన వరదలు మరియు భారీ వర్షాల మూలంగా పంట దెబ్బతిందని, అందుచే ధరలు పెరిగాయని తెలిపారు.అదేవిధంగా ఈ స్థితిని అనువుగా మార్చుకుని కొంతమంది కృత్రిమ కొరత కూడా సృష్టించినట్టు తమ దృష్టికి వచ్చిందని... అటువంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నట్టు  పశుమత్స్య, మార్కెటింగ్ శాఖమంత్రి మోపిదేవి వెంకట రమణ రావు తెలిపారు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com