తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవానికి రావాలని టీటీడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఆహ్వానం పలికింది. కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ ఈవో అనిల్కుమార్ సింఘాల్, జేఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సీఎం వారిని వివరాలు అడిగి తెలుకున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.