మహారాష్ట్ర, హర్యానాలో ఆల్రెడీ ఎన్నికల సందడి మొదలైపోయింది. ఆ వేడిని మరింత పెంచుతూ... కేంద్ర ఎన్నికల సంఘం... ఆ రెండు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించబోయేదీ కాసేపట్లో ప్రకటించనుంది. హర్యానా అసెంబ్లీ కాలపరిమితి... నవంబర్ 2తో ముగుస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 8తో ముగుస్తుంది. ఐతే... మహారాష్ట్రలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 288 ఉండగా... బీజేపీ 122, శివసేన 63, కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 స్థానాలు గెలుచుకున్నాయి. మిగతా పార్టీలు 20 సీట్లు గెలుచుకున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో... 15 ఏళ్ల పొత్తులను వదులుకొని... కాంగ్రెస్, ఎన్సీపీ వేర్వేరుగా పోటీ చేశాయి. కారణం సీట్ల షేరింగ్లో రెండు పార్టీలకు సెట్ కాలేదు. అదే సమయంలో... బీజేపీ సింగిల్గానే బరిలో దిగి... 122 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అదే సమయంలో... శివసేన ఒంటరిగా పోటీ చేసి... 63 సీట్లు సాధించింది.
ఇప్పుడు కాంగ్రెస్, ఎన్సీపీ ఆల్రెడీ అనధికారికంగా సీట్ల షేరింగ్ చేసుకున్నాయి. కాంగ్రెస్ 123, ఎన్సీపీ 125 సీట్లలో పోటీ చేస్తుందని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ ఇటీవలే ప్రకటించారు. మిగతా 41 స్థానాల్లో ఇతర మిత్రపక్షాలు పోటీ చేస్తాయని వివరించారు. రెండు పార్టీల మధ్యా కుదిరిన ఏకాభిప్రాయంతోనే సీట్ల సర్దుబాటు జరిగిందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ఇప్పటికే 104 మందితో తొలి జాబితా రెడీ చేసుకుంది. ఇందులో మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్తోపాటూ... పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్ థొరాట్ పేర్లు కూడా ఉన్నాయి. మరోవైపు ఆల్రెడీ కలిసి కొనసాగుతున్న బీజేపీ, శివసేన మధ్య నెక్ట్స్ ఎన్నికల్లో పొత్తుల కోసం చర్చలు సాగుతున్నాయి. ఈసారి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రేను బరిలో దింపాలనుకుంటున్నారు.