ఉద్యోగుల భవిష్య నిధిపై కీలక నిర్ణయానికి భారత ప్రభుత్వం గురువారం ఆమోదముద్ర వేసింది. ఉద్యోగుల భవిష్య ఈపీఎఫ్ పై 8.65 శాతం వడ్డీ అందించాలన్న ప్రపోజల్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. 2018–19 కాలం నాటికి 6 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ వడ్డీరేటు 2017–18 కాలానికి 8.55గా ఉండేది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్వో సంస్థ ఇకపై చందాదారుల క్లెయిమ్లను 8.65 శాతం వడ్డీతో సెటిల్ చేయనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈపీఎఫ్ రేటును 8.65 శాతానికి పెంచుతూ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయం తీసుకుంది.