అమెరికా పర్యటనలో భాగంగా ఈ నెల 24న న్యూయార్క్ నగరంలో గ్లోబల్ గేట్కీపర్స్ అవార్డ్ను ప్రధాని నరేంద్ర మోదీ స్వీకరించనున్నారు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ అవార్డును మోదీకి ప్రదానం చేయనుంది. స్వచ్ఛ భారత్ పేరిట భారత్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచేందుకు ముందుండి కృషిచేస్తున్న ప్రధాని మోదీకి ఈ అవార్డును అందజేయనున్నామని గేట్స్ ఫౌండేషన్ ఇటీవలే ప్రకటించింది. మానవజాతి ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ్యం ముఖ్యమని గేట్స్ ఫౌండేషన్ పేర్కొంది. స్వచ్ఛ భారత్ పేరిట భారత్లో మురుగుదొడ్లు నిర్మించడం అత్యంత కీలకమైన అంశమని ఫౌండేషన్ పేర్కొంది.