న్యూఢిల్లి : భారత్ ఆధ్వర్యంలో సాగుతున్న నావికాదళ విన్యాసాలు నేటితో ముగియనున్నాయి. ఈ నావికాదళ విన్యాసాల్లో భారత్తోపాటు థాయ్లాండ్, సింగపూర్ దేశాలు కూడా పాల్గొంటున్నాయి. అండమాన్ దీవుల వద్ద సముద్రంలో ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. హిందూ మహా సముద్రంలో పరస్పరం ఈ మూడు దేశాలు కలిసి కృషి చేసే అంశాన్ని పరిశీలించడానికిగాను ఈ విన్యాసాలను నిర్వహించారు.