ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇ-సిగిరెట్లను నిషేదిస్తున్నామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇ-సిగరెట్ల తయారీ, విక్రయం, దిగుమతి, నిల్వలపైనా నిషేధం విధిస్తున్నామన్నారు. ఇ-సిగరెట్ల వలన యువతపై చెడు ప్రభావం పడుతుందని, వీటి వాడకం వలన అమెరికా లాంటి దేశాలలో కూడా దుష్ప్రభావాలు తలెత్తాయని అందుకే భారత్ లో నిషేధం విధిస్తున్నామన్నారు.