ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బిజెపి ధర్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2019, 03:10 PM

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బిజెపి ధర్నా చేపట్టనున్నది. భారీ వర్షాలు, తదనంతరం సంభవించిన వరదల కారణంగా ఇబ్బందులకు గురైన రైతులను, ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మధ్యప్రదేశ్‌ బిజెపి అధ్యక్షుడు రాకేశ్‌ సింగ్‌ ఆరోపించారు. వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో వరద పీడిత ప్రాంతాల్లో ఎక్కడా అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతూ కనిపించడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ ప్రతి అసెంబ్లి నియోజక వర్గంలోనూ బిజెపి ధర్నాలు చేస్తుందని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com