స్వాతంత్య్రోద్యమకారుల కలలు ఇన్నాళ్లకు ఫలించాయని జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్దాస్ అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో స్వాత్యంత్య్రోద్యమంలో పాల్గొన్న బిర్సా ముండా, సిధు కన్హు కలలు ఫలించాయని ఆయన చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పిఒకె కూడా భారత్లో అంతర్భాగమవుతుందని తాను విశ్వసిస్తున్నట్లు ఆయన చెప్పారు.