సిమ్లా : ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు సిమ్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉడాన్ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం మేరకు ప్రాంతీయ విమానాల కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో కేంద్రం విమాన చార్జీలకు సబ్సిడీ ఇస్తుంది. ఉడాన్ పథకం కింద ఢిల్లీ నుంచి సిమ్లాకు విమాన చార్జి రూ. 2500 మాత్రమే అని పేర్కొన్నారు.