గోదావరిలో మునిగిపోయిన పర్యాటక బోటు ఆచూకీ లభ్యమైంది. 250 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. నీటిపైన ఇంజిన్ ఆయిల్ మరకలు తేలియాడుతున్న ఆనవాళ్లను గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలోనే బోటు మునిగిపోయి ఉంటుందని చెబుతున్నారు. బోటుని వెలికి తీస్తే కానీ అందులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మునిగిపోయారు అనేదానిపై స్పష్టత రాదంటున్నారు. అలాగే గల్లంతైన వారి ఆచూకీ కూడా లభ్యమవుతుందని చెప్పారు. అయితే బోటుని బయటకు తియ్యడం అంత తేలికైన విషయం కాదని అధికారులు చెబుతున్నారు. బోటుని వెలికి తియ్యడం కోసం అధికారులు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.