ద్రవ్యోల్బణం అదుపులో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు. నేడిక్కడ విలేకరుల సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఎగుమతులపై పన్ను తగ్గంపు విషయమై పునరాలోచిస్తున్నామని అన్నారు. ఈ ఆర్థిక ంసవత్సరంలో వృద్ధి రేటు ఆశాజనకంగా ఉందని ఆమె చెప్పారు. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్తో పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నామని ఆమె అన్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లో రుణ వితరణ పెరుగుతోందని ఆమె చెప్పారు.