జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్కతాలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. అస్సాంలో ప్రభుత్వం విడుదల చేసిన ఎన్ఆర్సీ తుది జాబితాలో దాదాపు 19 లక్షల మందికి చోటు దక్కలేదన్నారు. ఈ జాబితాలో పేరు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది హిందువులు, ముస్లింలు, బౌద్ధులే ఉన్నారని ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయిన తర్వాత కూడా ప్రజలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.