22 నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నందునే టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ తెలిపారు. బుధవారం అయన మీడియాలో మాట్లాడుతూ ఈ అరెస్టు వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని వెల్లడించారు.
లొంగిపోతానని ముందుగా చింతమనేని తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని , పెదపాడు కుసాన వెంకటరత్నం అనే వ్యక్తిపై దాడి చేసి, కులం పేరుతో దూషించిన కేసులో ఆతని అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. వివిధ కేసుల్లో మరికొందరిని అరెస్ట్ చేయాల్సి ఉందని, నిందితులు పరారీలో ఉన్నందున ఇతర ప్రాంతాల్లో రెండు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.
చింతమనేని నివాసం సోదాలకు వెళ్లిన మహిళా కానిస్టేబుళ్ళని నిర్బంధించి మరో తప్పు చేశారని, మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఎస్ పి చెప్పారు