ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాంగ్ కాంగ్ లో ప్రజాస్వామ్య ఉద్యమం

international |  Suryaa Desk  | Published : Sun, Sep 08, 2019, 01:26 PM

హాంకాంగ్ రాజ్యాంగాన్ని కాపాడాలని అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నారు. ఇప్పటివరకూ ఖైదీల అప్పగింత చట్టానికి వ్యతిరేకంగా సాగిన హాంకాంగ్ ఉద్యమం, ఇప్పుడు స్వాతంత్ర్య పోరాటం రూపు దాల్చుకుంది. తమ దేశానికి చైనా నుంచి విముక్తి కల్పించాలంటున్నారు. ఈ మేరకు ప్లకార్డులు పట్టుకుని చైనా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. కొన్నిదశాబ్దాల పాటు బ్రిటన్ పాలనలో ఉన్న హాంకాంగ్ ను 1997లో బ్రిటిష్ పాలకులు చైనాకు అప్పగించారు. అయితే హాంకాంగ్ లో ప్రజాస్వామ్యం, సొంత న్యాయవ్యవస్థ ఉండేలా చట్టాలు రూపొందించారు.


ఇందుకు అంగీకరించిన చైనా ప్రస్తుతం ‘ఒకదేశం రెండు వ్యవస్థలు’ అనే విధానాన్ని పాటిస్తోంది. అయితే ఇటీవల హాంకాంగ్ పాలకులు  ఈ ప్రాంతంలో నేరాలకు పాల్పడే వ్యక్తులను చైనాకు అప్పగించేలా, అక్కడి కోర్టులు విచారించేలా కొత్త బిల్లును రూపొందించారు. దీంతో తమ ప్రజాస్వామ్య హక్కులను, స్వేచ్ఛను చైనా హరించి వేస్తోందని హాంకాంగ్ వాసులు ఉద్యమబాట పట్టారు.




చివరికి ఈ బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని హాంకాంగ్ సీఈవో క్యారీ లామ్ ప్రకటించినప్పటికీ పరిస్థితి సద్దుమణగకపోగా, ఆందోళన కాస్తా ప్రజాస్వామ్య ఉద్యమం రూపు తీసుకుంది. కాగా, ఈ ఉద్యమం వెనుక అమెరికా, బ్రిటన్ లు ఉన్నాయని చైనా ఆరోపిస్తోంది. ఈ ఆందోళనల వల్ల హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని చైనా హెచ్చరించింది. అయితే డ్రాగన్ దేశం వాదనల్ని అమెరికా, బ్రిటన్ లు ఖండించాయి. ఆందోళనకారుల విషయంలో చైనా సంయమనం పాటించాలనీ, మానవహక్కులను ఉల్లంఘించరాదని కోరాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com