ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పెషల్ స్టేటస్ తో పాటు స్పెషల్ ప్యాకేజీ 

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2019, 08:05 PM

తెలంగాణ కన్నా రాయలసీమ పూర్తిగా వెనకబడ్డ ప్రాంతమని ఎంపీ, బీజేపీ నేత టీజీ వెంకటేశ్‌ అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉండాలని, పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తిచేసే విధంగా ముందుకు పోవాలని సూచించారు. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక సర్వసభ్య సమావేశంలో టీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్లముదు నీరున్నా తాగలేని పరిస్థితి సీమలో నెలకొందన్నారు. శ్రీశైలం ఒక స్టోరేజ్‌ ట్యాంక్‌లా మిగిలిన ప్రాంతాలకు మాత్రం ఉపయోగపడుతోందని అన్నారు. రాయలసీమ బాగుపడటం కోసం స్పెషల్‌ స్టేటస్‌తో పాటు స్పెషల్‌ ప్యాకేజీ కూడా తప్పనిసరి అని అన్నారు. లేకపోతే ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావడం కష్టమని అన్నారు. బీజేపీ రాయలసీమ అభివృద్ధికి డిక్లరేషన్‌ ఇచ్చిందని, సీమ అభివృద్ధి కోసం శాంతియుతంగా పోరాడే వారికి పూర్తి మద్దతిస్తామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com