అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్ధులు దుర్మరణం చెందారు. ఓక్లాలోని టర్నల్ జలపాతంలో ఈతకు వెళ్లిన ఓలేటి కౌశిక్, కేదారనాథ్ రెడ్డి మృత్యువాత పడ్డారు. .మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..ఓలేటీ కౌశిక్ ది ప్రకాశం జిల్లా కనిగిరి కాగా కేదార్ నాథ్ రెడ్డిది నెల్లూరు. . వీరిద్దరూ . టెక్సాస్ యూనివర్శిటీలో ఎంఎస్ చేయడానికి వెళ్లారు. కౌశిక్, కేదారనాథ్ రెడ్డి మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.