రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా విధ్వంస రాజకీయాలకు నాంది పలికిందని, కక్ష ధోరణితో వ్యవహరిస్తోందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచినా ఇలా కక్షపూరితంగా ఎన్నడూ వ్యవహరించలేదని ఆయన చెప్పారు. తన 40 ఏళ్ల అనుభవంలో ఇంతటి దారుణమైన ప్రభుత్వాన్ని చూడలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తనపై దౌర్జన్యం చేయాలనుకున్నారని ఆయన చెప్పారు.