ఏపీ లో ఏర్పడ్డ ఇసుక కొరత పై మరో సారి స్పందిస్తూ మాజీ సీఎం చంద్రబాబు వైసీపీ నేతల పై ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. వైసీపీ నేతల జేబులు నింపడం కోసమే ఇసుక కొరతను సృష్టించారని, ఇసుకను తవ్వడం దగ్గర నుంచి తరలించడం, నిల్వచేయడం, అమ్ముకోవడం అంతా అక్రమమేనని మండిపడ్డారు. ఇదంతా వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని, అందుకే దీనిపై చర్యలు తీసుకోవడం లేదని చొప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వ కారణంగా నిర్మాణరంగంలో చాలా మంది కార్మికులకు పనులు లేకుండా పోయాయని తెలిపారు. పార్టీ నేతలను మేపడం కోసం బీద కార్మిక ప్రజలను పస్తులుంచడం దుర్మార్గమని ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు.