ట్రెండింగ్
Epaper    English    தமிழ்

70వ వనమహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2019, 12:53 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఏపీ సీఎం జగన్ మోమన్ రెడ్డి తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించే నిమిత్తం అడవుల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 70వ వన మహోత్సవాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో విద్యార్థులతో కలసి మొక్కలు నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు వనమహోత్సవ కార్యక్రమం కొనసాగనుందని తెలిపారు.   


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com