ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిస్సింగ్ కేసులో బిజెపి నేతపై కేసు నమోదు..

national |  Suryaa Desk  | Published : Wed, Aug 28, 2019, 12:14 PM

యువతి అదృశ్యమైన ఘటనపై భారతీయ జనతా పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై కేసు నమోదైంది. షాజహన్‌పూర్ జిల్లాలో ఎల్ఎల్ఎమ్ చదువుతున్న ఓ విద్యార్థిని సదరు మంత్రిపై విమర్శలు చేస్తూ ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను అప్‌లోడ్ చేసింది. ఆ మరుసటి రోజు నుంచి విద్యార్థిని కనిపించడం లేదు. అయితే తమకు చిన్మయానంద్‌పై అనుమానాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయన మీద ఐపీసీ సెక్షన్లు ప్రకారం.. అపహరణ, నేరపూరిత చర్యల కింద కేసు నమోదు చేసినట్లు షాజహన్‌పూర్ జిల్లా ఎస్పీ ఎస్ చనప్ప తెలిపారు.


మాజీ మంత్రి చిన్మయానంద్ తనను, తన కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని.. దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని.. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనకు తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో యువతి వాపోయారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com