దొంగతనానికి వచ్చి బిడ్డను మరిచిపోయిన ఘటన న్యూజెర్సీ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఓ మహిళ తన ఇద్దరి స్నేహితులతో కలిసి ఓ షాప్కు దొంగతనానికి వెళ్లింది. అక్కడికి తన బిడ్డను కూడా తీసుకెళ్లింది. తన ఇద్దరు స్నేహితులు స్టోర్ సిబ్బందితో మాటలు కలిపి వారి దృష్టి మరల్చగా.. ఆమె స్ట్రోలర్ను(పిల్లలు కూర్చునే చక్రాల కుర్చీ) తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే, సదరు మహిళ స్ట్రోలర్ను తీసుకెళ్లే క్రమంలో తన బిడ్డను స్టోర్లోనే వదిలేసిన సంగతి మరచిపోయింది. ఆ తర్వాత కాసేపటికి తన ఇద్దరి స్నేహితులు కూడా అక్కడి నుంచి వచ్చేశారు. కాసేపటి తర్వాత బిడ్డ లేని విషయం గమనించి.. తిరిగి స్టోర్కు వెళ్లారు. అప్పటికే చోరీ విషయం గుర్తించిన సిబ్బంది ఆ మహిళలను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ తతంగాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది.