నెల్లూరు: త్వరలో రాష్ట్రంలో సరికొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొస్తామన్నారు ఏఐసీసీ చైర్మన్ రోజా. లంచాలు ఇవ్వకుండానే, ఇచ్చిన గడువు లోపలనే పరిశ్రమలకు అనుమతులు వచ్చేలా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని, సీఎం ఆలోచనలకు అనుగుణంగా మంచి పారిశ్రామిక పాలసీని తీసుకొస్తారన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు భారీగా గండికొట్టిందని విమర్శలు చేశారు.