జార్ఖండ్లోని గుడాబందా పరిధిలోని సింహపురాకు చెందిన ఛాగలీడాంగాలో గల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయిన నేపధ్యంలో ఏడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో కొవ్వొత్తులు, టార్చిలైట్ వెలుగులో ఏఎన్ఎంలు గర్భిణులకు డెలివరీ చేస్తున్నారు. ఈ విషయమై విద్యుత్ శాఖ అధికారులకు తెలిసినా వారు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో ఆసుపత్రిలో సురక్షిత డెలివరీలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ సందర్భంగా ఆసుపత్రి ఎఎన్ఎంతో పాటు గ్రామస్తులు మాట్లాడుతూ గతవారంలో పిడుగుపాటు కారణంగా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి, పీహెచ్సీకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో కొవ్వొత్తి వెలుగులోనే డెలివరీలు చేయాల్సివస్తోంది. ఇదేవిధంగా గత ఏడు రోజుల్లో మూడు డెలివరీలు జరిగాయి. మరోవైపు ఇక్కడ అంబులెన్స్ ఉన్నప్పటికీ, విద్యుత్ లేని కారణంగా అంబులెన్స్ సిబ్బంది తమ మొబైల్స్ను చార్జింగ్ చేసుకోలేకపోతున్నారని తెలిపారు.