హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నది ఉరుకులు పరుగులతో ఉదృతంగా ప్రవహిస్తోంది. బియాస్ అంటే భయంకరమైనది అని అర్థం. పేరుకు తగినట్లుగానే వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో నదిప్రవాహం వేగవంతమైంది.బీయాస్ వరదల్లో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు విపత్తు అథారిటీ, పోలీసులు, అగ్నిమాపక దళాలు తీవ్రంగా కృషి చేశారు. తాళ్లు కట్టివారిని పైకి లాగి..ఎట్టకేలకూ వారిని సురక్షితంగా రక్షించాయి. రాష్ట్రంలోని కాంగ్రా జిల్లాలోని నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కాంగ్రా జిల్లాలోని మా చాముండీ ఆలయ ప్రాంగణంలోకి వరద నీరు భారీగా ప్రవేశించింది.