గుంటూరు: వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమతో ఎన్నో పనులు చేయించుకున్నారని, అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… పల్నాడులో బీజేపీ నిర్వహించనున్న ధర్నా వాయిదా మాత్రమేనని..రద్దు కాదన్నారు. డీజీపీని కలిసి పల్నాడులో పరిస్థితులపై ఫిర్యాదు చేస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఎంతమంది అవినీతిపరులను వెలికితీశారని ప్రశ్నించారు. మైనింగ్ అక్రమ రవాణాలో వ్యక్తులు మారారని.. అంతా మాములేనని కన్నా అక్ష్మీనారాయణ అన్నారు.