న్యూఢిల్లి : దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉండటం పట్ల అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టులకు, సుప్రీంకోర్టు మధ్య అప్పీల్ కోర్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశంలో నాలుగు ప్రాంతాల్లో అప్పీల్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. అప్పీల్ కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కూడా సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ ఆధారంగా జరగాలని ఆయన అన్నారు.