ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. మైన్పూరి పోలీస్ స్టేషన్ లో మహిళను దుండగులు కాల్చి చంపారు. భూమి గొడువలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆమేపై ప్రత్యర్థులు కిరాతకంగా కాల్చి చంపారు. కళ్ల ముందు హత్య జరిగినా కనీసం పోలీసులు ఆపేందుకు యత్నించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మృతురాలి బందువులు.. నిందితుణ్ని పట్టుకొని చితకబాదారు. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూండాలకు సహకరించేందుకే.. చూసిచూడనట్లు వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.