విద్యాశాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యాశాఖలో తీసుకురానున్న సంస్కరణలపై సీఎం ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. అలాగే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు, నిపుణుల కమిటీ నివేదికపైనా చర్చించనున్నారు. అలాగే విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై చర్చ జరిగే అవకాశముంది.