జమ్మూకశ్మీర్ పునర్ విభజన బిల్లు అప్రజాస్వామికమని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ఆరోపించారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని మూడవ సెక్షన్ను ఉల్లంఘించారన్నారు. ఏపీ, తెలంగాణ విభజన రాజ్యాంగంలోని సెక్షన్ 3 ప్రకారం జరిగిందన్నారు. ఆ సెక్షన్ ప్రకారం రాష్ట్ర విభజన కోసం అసెంబ్లీ తీర్మానం అవసరం అని తెలిపారు. రాష్ట్ర సరిహద్దులు మార్చాలంటే ఈ నిబంధన అవసరం అన్నారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం ఉందని తివారీ చెప్పారు. దేశ విభజన సమయంలో జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్ అంశాలపై సమస్య వచ్చిందని, అయితే కశ్మీర్ ఎవరితో కలవాలన్న దానిపై మహారాజా హరి సింగ్ వద్ద ఉన్న రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, కానీ నెహ్రూ అక్కడికి దళాలను పంపి కశ్మీర్ను భారత్లో కలిసేలా చేశారని తివారీ చెప్పారు. అయితే ఆ సమయంలో అమిత్ షా జోక్యం చేసుకున్నారు. ఇంతకీ 370 రద్దుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా లేదా అన్న అంశాన్ని తేల్చాలన్నారు.