గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు హైదరాబాద్ మహా నగరం తడిసి ముద్దవుతోంది . వర్షాలకు రోడ్లలపై గుంతలు ఏర్పడ్డాయి. భాగ్యనగరంలో మొత్తం 4 వేలకుపైగా గుంతలు ఏర్పడినట్టు గుర్తించిన అధికారులు చేస్తున్న మరమ్మత్తులన్నీ తూతూ మంత్రంగా మారిందని జనం పెదవి విరుస్తున్నారు. వర్షం నీరు గుంతల్లోకి చేరడంతో ప్రమాదానికి గురవుతున్నారు.
బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతంలో ఆగస్టు 5లోగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.