ముంబై : వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 167 పాయింట్లు లాభపడి 28468.75 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి 44 పాయింట్లు లాభపడి 8822వద్ద ముగిసింది. మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు నేడు లాభాల బాట పట్టాయి. నిఫ్టీ కీలకమైన 8,800 మార్కును దాటింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.02 వద్ద కొనసాగుతోంది.