జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ నెల 29 నుంచి పార్టీ సమావేశాలు నిర్వహించనున్నారు. జనసేన పార్టీ కమిటీలు, నాయకులు, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. విజయవాడ, మంగళగిరి సమావేశాల్లోని పార్టీ కార్యాలయాల్లో ఈ భేటీలు నిర్వహించనున్నారు. పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించిన కార్యకర్తలు, ముఖ్య నేతలతో చర్చిస్తారు. భవిష్యత్తులో జనసేన పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపై వారితో చర్చలు జరుపుతారు. ఈనెల 29న ఉదయం 11 గంటలకు పార్టీ నాయకులు, వివిధ కమిటీలతో చర్చిస్తారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని జనసేన కార్యాలయంలో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతుంది. 30వ తేదీ ఉదయం 11 గంటలకు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం, సాయంత్రం 4 గంటలకు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం, 31 ఉదయం రాజమహేంద్రవరం పార్లమెంట్ మీద చర్చ జరుగుతుంది. నరసాపురం లోక్సభకు పోటీ చేసిన నాగబాబు అక్కడ ఓటమి పాలయ్యారు. నరసాపురం లోక్సభ పరిధిలోని భీమవరం అసెంబ్లీ నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయారు.