తెలుగుదేశం ఎమ్మెల్యే కింజరాప్ అచ్చెన్నాయుడు తన సస్పెన్షన్ పై స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు. తాను ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడలేదన్నారు. తన సీట్లో కూర్చునే నిరసన తెలిపినా తనను సస్పెండ్ చేశారన్నారు. మార్షల్స్ తో బయటకు పంపి నన్ను అవమానించారన్నారు. తన సస్పెన్షన్ ను పున: పరిశీలించాలంటూ స్పీకర్ కు లేఖ రాశారు.