ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలోని నారాయణ, చైతన్య కాలేజీలను సీజ్ చేసి, వాటి అక్రమాల పై సీబిసీఐడి విచారణ జరిపించాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వారు కార్పోరేట్ దిష్టిబొమ్మ దహనం చేశారు. చైతన్య, నారాయణ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.