విజయవాడ, సూర్య బ్యూరో : ‘‘మనం మొదట భారతీయులం, తర్వాతే హిందు వులం లేక మహ్మదీయులం అని కొందరు చెప్పడం నాకు నచ్చదు. దీంతో నాకు సంతప్తి లేదని నిర్మొహమాటంగా చెబుతాను. భారతీయులమనే భావనకు ఎలాంటి పోటీ వుండకూడదని నా ఉద్దేశ్యం. మతం నుండి పుట్టనీ, సంస్క తి నుండి పుట్టనీ, లేక భాష నుండి పుట్టనీ, ప్రజలందరూ మొదటా. చివరా కూడా భారతీయులుగానే వుండాలని కోరుకుంటున్నాను. భారతీ యులు తప్ప మరేమీ ఉండకూడదు.’’ ఏప్రిల్ 14 రోజును ‘‘దేశసమైఖ్యత, లౌకికవాద పరిరక్షణ దినం’గా జరుపుకుందాం అని ఏపీసీసీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగ రచన అవసరమైనప్పుడు అంబేద్కర్ రాజ్యాంగ కమిటీలోకి ప్రవేశించడానికి కాంగ్రెస్ అండగా నిలిచిందన్నారు. ఆ తర్వాత రచనా కమిటీ చైర్మన్గా ఎన్ను కుందన్నారు. అంబేడ్కర్తో కలిసి రాజ్యాంగ రచనకు పూనుకున్నది కాంగ్రెస్ అని తెలిపారు.