ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ కు నరసింహన్ విందు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2019, 10:50 AM

గవర్నర్ నరసింహన్ నేడు విజయవాడ రానున్నారు. ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు ముఖ్యమైన నేతలకు విందు ఇవ్వనున్నారు. గవర్నర్ నరసింహన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ నియమితులైన సంగతి తెలిసిందే. తాను పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనుండటంతో గవర్నర్ నరసింహన్ రాజకీయ నేతలకు విజయవాడలో ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నారు. ఈ నెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com