వాహన చోదకంలో ఎవరికీ రానురాను స్పృహలేకుండా పోతున్నదని. పైగా 8వ తగరతి నుంచే చిన్న పిల్లలకు వాహనాలు ఇచ్చి రోడ్డు మీదకు పంపుతున్నారని ఈ చర్యలు మూలంగా ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయని రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం మచిలీపట్నంలో జరిగిన అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చాలా మంది యువకులు, మహిళలు చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ప్రాణం అంటే లెక్కలేకుండా నడిపి ్రపమాదాల బారిన పడుతున్నారని, చిన్న పిల్లలకు సైతం వాహనాలు ఇవ్వటంవల్ల భవితనికోల్పోతున్నారన్నారు. చిన్నారులకు ఎట్టి పరిస్థితిలోనూ వాహనాలు ఇవ్వద్దని, ఇస్తే తల్లిదండ్రులు, వాహన యజమానులు కూడా శిక్షకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. విద్యార్ధులలో రోడ్డు భద్రతపై అవగాహన తెచ్చేందుకు ప్రతివారం ఆయా కళాశాలలు, పాఠశాలల్లో రవాణా అధికారులు పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మనవంతు కృషి చేయాలనేదే తన తపన అని మంత్రి వేడ్కొన్నారు. ముఖ్యంగా మధ్యం సేవించి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు రవాణాశాఖాధికారులు పెద్దఎత్తున తనిఖీలు నిర్వహించాలన్నారు. అంతేకాకుండా జాతీయరహదారుల్లో నడిచే వాల్వో తదితర బస్సలతో పాటు ఆర్ టిసి బస్సులు, లారీలను కూడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి రోడ్డు ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా బిల్లులు, అనుమతులు లేని ఇసుక, మట్టి రవాణాచేసే వాహనాలను కూడా తనిఖీలు చేసి కేసులు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు.